AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ. 40 లక్షల నిధులను స్పీకర్ మంజూరు చేయించారు. పనులను కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ఆయన పర్యవేక్షించారు. పనులు నాణ్యతపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.