SRD: కాలనీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.