KMM: ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలన అని అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అలాగే ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాయ కష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పు చేసి పేద ప్రజలు భూములు కొని ఇళ్లు నిర్మించుకుంటే దయాదాక్షణ్యం లేకుండా ఈ ప్రభుత్వం కూలగొడుతుందా అనే ప్రశ్నించారు.