MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కావడంతో ఫిబ్రవరి 3న దేవాలయంలో ఉదయాన్నే పూజలు నిర్వహించి మూసివేస్తామన్నారు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉండవని వెల్లడించారు. 4న దేవాలయంలో సంప్రోక్షణ పూజలు చేసి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.