BPT: అద్దంకి మండలంలోని మధుర నగర్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొంగపాడు గ్రామానికి చెందిన వినోద్, చిన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు పేర్కొన్నారు.