KRNL: వేరుశనగ పంట పాసింగ్(గ్రేడింగ్) విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని శనివారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవింద్కు వినతిపత్రం అందజేసి, గతంలో రద్దైన విధానాన్ని వ్యాపారస్తులు తిరిగి అమలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు.