VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, భోగాపురం మండలం, ముంజేరు గ్రామ పంచాయితీలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మన పల్లె శుభ్రత-మనందరి బాధ్యత అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.