AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, తమ తల్లి నూకళ్ల దేవి కనిపించడం లేదంటూ సంఘటనా స్థలం వద్ద ఆమె ఇద్దరు కుమార్తెలు రోదిస్తున్నారు. వారు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. కాగా, ఈ ఘటనలో 21మంది మృతి చెందారు.