VSP: జిల్లాలో జర్నలిస్టులకు 2026–27 సంవత్సరానికి మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. కార్డులు ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసుల జారీ కూడా మార్చి 2 నుంచి పొందవచ్చు.