MDK: రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇటీవల స్వాధీనం చేసుకున్న 16 ట్రాక్టర్ల ఇసుక బహిరంగ వేలం పాట నిర్వహించగా 8 మంది వ్యాపారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.43 వేలకు స్థానిక ఇసుక వ్యాపారి మల్లారెడ్డి ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ తెలిపారు.