HYDలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చివరి మజిలీ చాలా కష్టంగా మారిందని బాధితులు లబోదిబోమంటున్నారు. రోజు దాదాపుగా 50 కి పైగా కేసుల్లో మృతదేహాలకు పైగా పోస్టుమార్టం జరుగుతుంది. కానీ.. మృతదేహాలను తరలించేందుకు సరైన సంఖ్యలో అంబులెన్సులు లేకపోవడంతో, ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.