SRD: కంగ్టి మండలం తుర్కవడ్గం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విద్యాసామాగ్రిని పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కిషన్ పవార్ తెలిపారు. పాఠశాల, విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా దాత రేణీ గ్రేస్, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్యకు పాఠశాల బృందం తరపున HM కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.