WG: పట్టణ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీసులో వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. పైప్ లైన్ లీకేజీలను గుర్తించి, సరి చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి పైపుల నుంచి నీటి నాణ్యతను సేకరిస్తామన్నారు.