HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను నాంపల్లి కోర్టు మూడోసారి వెనక్కి పంపింది. అల్లు అర్జున్తో సహా 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఈ పత్రాల్లో హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటి కీలక సాంకేతిక ఆధారాలు జతపరచలేదని కోర్టు గుర్తించింది. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తూ చార్జిషీట్ను రిటర్న్ చేసింది.