HYD: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.