మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో అడవి శేష్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ఓ 7 ఏళ్ల బాలుడు సందీప్ మ్యూజియంను సందర్శించాడని ఆయన తల్లి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రం ద్వారా మరికొన్ని లక్షల మందికి మేజర్ వీరత్వం తెలియడం తనకు ఎంతో గర్వకారణమని శేష్ ఆనందం వ్యక్తం చేశాడు.