NGKL: చారకొండ మండలంలోని అగ్రహారం తండా గ్రామ పంచాయతీలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సర్పంచ్ నేనావత్ లక్ష్మణ్ నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఉచితంగా నాణ్యమైన మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.