MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో 25 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి పూర్తి నివేదిక సిద్ధం చేసి బాధిత రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.