PDPL: రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం మండలాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.