TG: పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో ‘జలసౌధ’లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ నెల 4న హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వే చేసి, సోమశిలలో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.