NZB: సిరికొండ మండలం చీమన్పల్లిలో ఓ ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన 16 టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకాల గ్రామానికి చెందిన మాలావత్ గోపి అడవిలో నుంచి టేకు దుంగలు నరికి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై మాలావత్ గోపి, శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగరావు తెలిపారు.