TG: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీతో కలిసి ఆయన పాల్గొన్నారు.