BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఉద్యమకారుల ఇంఛార్జ్ పొడియం నరేందర్ కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి తదితర అధికారులను సన్మానించారు.