‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్షీట్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.