NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సీడం గంగారంకు చెందిన పెంకుటిల్లు గోడ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. గోడ కులే సమయంలో ఇంట్లో ఉన్న ఆత్రం రాజు, అత్రం రవి, అత్రం వినేష్లకు గాయాలయ్యాయి. హుటాహుటీన కాలనీ వాసులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.