గద్వాల 2, 3 వార్డుల్లో వీధి కుక్కల బీభత్సంపై కాలనీవాసులు శుక్రవారం గద్వాల్ మున్సిపల్ ఛైర్పర్సన్ జయలక్ష్మి వినతి పత్రం అందజేశారు. వీధుల్లో చిన్నారులు ఆడుకోవాలన్నా, మహిళలు బయటకు వెళ్లాలన్నా ప్రాణ భయంతో వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి నష్టం వాటిల్లిన రైతులకు పరిహారం అందించి, కుక్కల బెడద నుంచి పట్టణాన్ని విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.