KMR: మాచారెడ్డి జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు కళా బృందం వారు విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా సైబర్ మోసాలు, ఆన్లైన్ భద్రత, బాలల హక్కులు, చట్టాల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.