PLD: నూజెండ్ల (మం) ఐనవోలులోని శ్రీ ఆంజనేయస్వామి తిరుణాల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకుడు నిస్శంకర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.