KDP: స్మార్ట్ పోలీసింగ్లో కడప జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శనివారం డీపీవోలో నేర సమీక్ష నిర్వహించిన ఆయన, డ్రోన్లు, ఈ-సాక్ష్య యాప్ల ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అసాంఘిక శక్తులు, రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేరాలు పునరావృతమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.