ELR: గుండుగొలనులోని వింధ్యవాసిని మంచినీటి చెరువు మరమ్మతు పనులను స్పెషల్ ఆఫీసర్, ఎంఈవో భాస్కర్ కుమార్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువుల వద్ద నిఘా పెంచుతామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.