అల్లూరి: జీ.మాడుగుల జీసీసీ, సివిల్ సప్లయ్ ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేసే కళాసీలపై కక్ష సాధింపు సరికాదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పండుబాబు అన్నారు. జీసీసీ గోదాంలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వైఖరిపై కళాశీలతో శనివారం గోదాం ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశీలకు రావాల్సిన బిల్లులు ఇంతవరకు పెట్టలేదన్నారు. ప్రశ్నిస్తే కులం పేరుతో వేధిస్తున్నాడని ఆరోపించారు.