సత్యసాయి: YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలలో నియమించారు. మడకశిరకు చెందిన జీఎస్ రంజిత్ కుమార్, కదిరికి చెందిన దేశాయ్ భక్తవత్సల రెడ్డి, యనమల ఆనంద్ రెడ్డి, పుట్టపర్తికి చెందిన టీడీ కేశవరెడ్డి, బి. మాధవరెడ్డి, పొరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. రామిరెడ్డిలకు వివిధ హోదాల్లో చోటు లభించింది.