శ్రీకాకుళం: ‘పొగాకు మానండి కేన్సర్ రాకుండా చూసుకోండి’ అని జిల్లా మహిళా మార్గదర్శి సంస్థ కో ఆర్డినేటర్ జే. చిరంజీవి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం మండలం శ్యామ్ పాలెం, కోళ్ల పేట గ్రామాల్లో పొగాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం వహించారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పొగాకు వాడకం పూర్తిగా తగ్గించాలని అన్నారు. దీనివల్ల ఇప్పటికే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారన్నారు.