VKB: తమ పట్టా భూములను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుందంటూ పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. భూమి కోల్పోవడంతో తాము రోడ్డున పడ్డామని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.