TG: ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని NTR ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.