KNR:కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు ఏఎస్సైలకు ఎస్ఐలుగా తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్- 3 సీనియారిటీ జాబితా ఆధారంగా ఈ ప్రమోషన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పదోన్నతి పొందిన అధికారులను కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట కమిషనరేట్లకు కేటాయించారు.