NGKL: కుమ్మెర బాధితులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. గురువారం తల్లోజు ఆచారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.