ADB: జిల్లాలో ఇసుక పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మన ఇసుక-వాహనం (MIV) పోర్టల్ ద్వారానే ఇసుక విక్రయాలు జరపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వినియోగదారులు తమకు కావలసిన ఇసుకను tgmiv.cgg.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని రాజర్షి షా సూచించారు.