కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు మంగళవారం ఎన్డీఏ నాయకులు చక్కటి మజ్జిగ అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.