ADB: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఇవాళ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన సమస్యలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.