GNTR: లింగాయపాలెంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. D12 సెక్షన్ పరిధిలో ‘RDSS’ పథకం కింద పాత స్తంభాలను మార్చే పనులను చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి, సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.