W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఎల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బందికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.