భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాలా తీవ్ర విమర్శలు చేసింది. తన అకాడమీ ద్వారా క్షేత్రస్థాయిలో క్రీడాకారులకు సేవలు అందించేందుకు అధికారులను పదేపదే సంప్రదించినప్పటికీ, వారు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది. క్రీడా వ్యవస్థలో ప్రతిభావంతులకు తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.