AP: పరిశ్రమలకు క్లీన్ ఎనర్జీ కీలకమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా అసైన్డ్ భూములు కేటాయిస్తామని వెల్లడించారు. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలకు లీజుకి ఇస్తామని పేర్కొన్నారు. రూ.10 లక్షల కోట్ల ఎనర్జీ ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు. 7.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు.