ఇవాళ్టి నుంచి ప్రపంచకప్ స్టేజ్-2 ఆర్చరీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ టోర్నీలో భారత్ బరిలో దిగుతుంది. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం.. విదేశీ కోచ్ అందుబాటులో లేని కారణంగా ఈ పోటీల్లో భారత్కు కఠిన పరీక్ష ఎదురుకానుంది.