SDPT: కోహెడ మండలం సీసీ పల్లెలో బెజ్జంకి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, పొదుపు ప్రాముఖ్యత, బీమా పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. కేవైసీ అప్డేట్ అవసరాన్ని వివరించి, సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ మోహన్, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.