BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి కళ్యాణి వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణంలో అగ్గి తెగులు, కాండం పురుగు ఉధృతి పెరుగుదలతో తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి తగ్గే అవకాశముందని గుర్తించారు. రైతులు తగిన మందులు సమయానికి పిచికారీ చేసి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏవో సూచించారు.