ADB: జైనథ్ మండల విద్యాశాఖ అధికారి MEO శ్రీనివాస్ బెల్లూరి పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పర్యవేక్షించిన ఆయన, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.