ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం మార్చి 1 వ తేదీన జరుగుతుందని డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ ఆలీ తెలియజేశారు. ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు హాజరుకావాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని సూచించారు.