MHBD: రైన్య తండా గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. పంట పక్వానికి వచ్చే సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం కారణంగా మొక్కలు నేలకు ఒరిగిపోయాయి. చాలా చోట్ల నీరు నిలిచి పంట మునిగిపోయింది. రైతులు పంట నష్టం భరించలేక ఆందోళన చెందుతున్నారు